వామ్మో.. మనిషి నుంచి శునాకినికి కరోనా వైరస్ రక్కసి..? ఎక్కడో తెలుసా..?
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే 3 వేలకు పైగా మంది చనిపోగా.. 86 వేల మందికి వైరస్ సోకింది. చైనాలోని వుహాన్లో వైరస్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల నుంచి ప్రజలకు వైరస్ సోకుతోంది. కానీ హాంకాంగ్లో మాత్రం ఓ మనిషి నుంచి కుక్క వైరస్ సోకబోతోంది. ఆ శునకం ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
శునకానికి కరోనా వైరస్ పాజిటివ్ అని హాంకాంగ్ వ్యవసాయం, మత్స్య పరిరక్షణ విభాగం పేర్కొన్నది. ఆ శునకాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆ కుక్కకు వైరస్ సోకకుంటే.. తిరిగి యాజమానికి అప్పగిస్తామని తెలిపారు. అయితే పెంపుడు జంతువులకు వైరస్ సోకినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపడం విశేషం.
దీనిపై యాజమానులు ఆందోళన చెందొద్దని ప్రతినిధులు సూచించారు. అయితే తమ పెంపుడు జంతువులను వదిలిపెట్టొద్దని జంతు ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఆ శునకానికి వైరస్ సోకిందో లేతో నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది అని పశువైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. హాంకాంగ్లో 103 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. జనం రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.