ఘోరం: అలబామాలో కాల్పులు: ఏడుగురు సజీవ దహనం
వాషింగ్టన్:
అమెరికాలోని
అలబామా
రాష్ట్రంలో
దారుణ
ఘటన
చోటు
చేసుకుంది.
అలబామా
రాష్ట్రంలోని
వాల్హెర్
మోసో
స్ప్రింగ్స్లోని
ఓ
ఇంట్లో
ఏడుగురు
వ్యక్తులు
మంటల్లో
సజీవదహనమయ్యారు.
గుర్తు
తెలియని
వ్యక్తి
కాల్పులు
జరపడంతో
ఏర్పడిన
మంటల్లో
వీరంతా
మరణించారు.
మంటల ధాటికి ఇల్లు కూడా కాలిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ ఇల్లు మంటల్లో కాలిపోతోంది.
వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చి.. లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆ ఇంట్లో ఏడుగురు చనిపోయి ఉన్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పెంపుడు కుక్క కూడా మరణించిందని చెప్పారు.
ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? ఎందుకు పాల్పడ్డారు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో నిందితులను ఎవరూ చూడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.