ఘోరం: బాలుడి శరీరంలో గాలి నింపి హత్య
ఢాకా: ఓ మైనర్ బాలుడి శరీరంలో గాలి నింపి దారుణ హత్యకు పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆ భయంకరమైన ఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. ఆ బాలుడు తనను విడిచిపెట్టాలను ఎంత వేడుకున్నా ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు.
ఆ బాలుడి శరీరంలోకి గాలికొట్టిన దుర్మార్డుడు అతడి ప్రాణాలు తొడేశాడు. బిడిన్యూస్24 కథనం ప్రకారం ఈ ఘటన బంగ్లాదేశ్లోని ఖుల్నా నగరంలో చోటు చేసుకుంది.
‘బాలుడి శరీరంలో గాలి నింపుతుండగా అతడు ఏడుస్తూ కేకలు వేశాడు. ‘అంకుల్ ఆపేయండి. లేకపోతే.. నేను చచ్చిపోతా' అని వేడుకున్నాడు' అని ఆ బాలుడు అరుపులు విన్న ఓ వ్యక్తి తెలిపాడు. కాగా, బాధితుడిని రకీబ్ హవల్దార్(12)గా గుర్తించారు.
హంతకుడి బంధువు ఇంట్లో పని చేస్తున్న ఆ బాలుడి నిందితుడి చిత్రహింసలు భరించలేక వేరే చోట పని వెతుకున్నాడు. అయినా వదిలిపెట్టని నిందితుడు.. రకీబ్ను బంధించి అతని శరీరంలోకి గాలి పంపు చేశాడు. దీంతో అతడు మృతి చెందాడు.
ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ మొత్తంలో గాలి వెళ్లడంతో ఊపిరితిత్తులు పగిలిపోయి బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉండగా, నిందితుడు బంధువులను బాధితుడి కుటుంబసభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.