బెనజీర్ భుట్టో హత్య చేసింది మేమే: తాలిబన్ టెర్రరిస్టులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టోను తామే హత్య చేశామని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.ఇంక్విలాబ్ మెహ్సూద్ సౌత్ వజీరిస్థాన్ అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఉగ్రవాదులు చేసిన ఘోరాలను వివరిస్తూ 2017 నవంబర్ 30న ప్రచురించిన ఈ పుస్తకం ఆదివారం విడుదలైంది. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హత్య చేసింది తామేనని పాక్లోని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. 'ఇంక్విలాబ్ మెహ్సూద్ సౌత్ వజీరిస్థాన్' అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించిందట. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు.. 588 పేజీలున్న ఈ పుస్తకంలో పలువురు తాలిబాన్ నేతలు, వారు చేసిన ఘోరాలను ప్రచురించారు
ఎంతమందిని ఏ రకంగా హత్య చేశారనే విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. అంతేకాదు పలు రకాల కారణాలను కూడ పొందుపర్చారు.బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రాముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి బాంబుల ద్వారా భుట్టోను చంపినట్లు ఈ పుస్తకంలో వెల్లడించారు.
ఆత్మాహుతి అనంతరం ఇక్రాముల్లా తప్పించుకున్నాడని ఆయన ఆ పుస్తకంలో రాశారు.అయితే బుట్టో హత్య వెనుక లాడెన్ హస్తం ఉన్నట్లు గతంలో నిఘావర్గాలు వెల్లడించాయి.