వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్

|
Google Oneindia TeluguNews

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ మసీదుల్లో మారణహోమం సృష్టించిన దుండగుడు బ్రెంటాన్ టారాంట్ నరనరాన జాత్యాంహకారం జీర్ణించుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా పశ్చిమ దేశాల్లో ఇతరదేశాల వారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని .. వీరిని ఇక్కడినుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని 74 పేజీల మేనిఫెస్టో లో పేర్కొన్నాడు. మసీదుల్లో దాడి చేసే ముందు తన వైఖరి స్పష్టంచేస్తూ మేనిఫెస్టోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి తన వర్ణ వివక్షను చాటుకున్నాడు.

మా పౌరులు కాదు .. కదా ..?

మా పౌరులు కాదు .. కదా ..?

ముఖ్యంగా ఇండియా, చైనా, టర్కీ దేశాలకు చెందిన వారు పశ్చిమ దేశాలకు శత్రువలను విషం కక్కాడు. 74 పేజీల్లో మేనిఫెస్టో లో తమ దేశాల్లో ఇతరులకు స్థానం లేదని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో అప్ లేడ్ చేసిన మేనిఫెస్టోకు 'ద గ్రేట్ రిప్లేస్ మెంట్‘ 'ద ఇన్వాడర్స్ మస్ట్ బీ రిమూవుడ్ ఫ్రం యూరోపియన్ సాయిల్‘ అనే పేరు పెట్టాడు. 'వారు ఎక్కడి నుంచి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారని .. ఈ మూడు దేశాలతోపాటు రోమ, ఆఫ్రికా, సెమిటిక్ దేశాలవారిని ప్రశ్నించాడు. 'వారు మా దేశ పౌరులు కాదు, కానీ మా భూభాగంలో నివసిస్తున్నారు, వారిని ఇక్కడినుంచి పంపించాల్సిన అవసరం ఉందని‘ తన తోలుమందాన్ని చాటుకున్నాడు.

నరనరాన జాత్యాంహకారం ..

నరనరాన జాత్యాంహకారం ..

మేనిఫెస్టో తో బ్రెంటాన్ వైఖరి స్పష్టమవుతోంది. అతని తీవ్రవాద భావజలానికి ఆకర్షితుడై .. వారి ఆలోచనలను ప్రభావితమయ్యాడు. ఆ మేరకు తమ దేశానికి వలసవచ్చిన వారు వెళ్లిపోవాలని రాశాడని అర్థమవుతోందని న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ తెలిపారు. ర్యాడికలిజానికి ప్రభావితమైన ..బ్రెంటాన్ మసీదులు లక్ష్యంగా దాడికి తెగబడినట్టు స్పష్టమవుతోందన్నారు.

డామినేట్ చేస్తారని భయం ...

డామినేట్ చేస్తారని భయం ...

తమ భూభాగల్లోకి ఇతరదేశస్థులను ఇలానే అనుమతిస్తే 2028-2038 వరకు ఇతరులే ఎక్కువగా ఉంటారని పేజీ నంబర్ 63లో బ్రెంటాన్ పేర్కొన్నాడు. దీంతో వలసవచ్చిన వారి జనాభా శాతం ఎక్కువవుతోందని ఆందోళన చెందాడు. అందుకోసమే వారిపై దాడి చేయాలనే ఆలోచన చేసినట్టు మేనిఫెస్టో ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

హీరోగా నిలిచిన మసీదు కార్మికుడు : గన్ లాక్కొని, బెదిరించడంతో దుండగుడు పరారీహీరోగా నిలిచిన మసీదు కార్మికుడు : గన్ లాక్కొని, బెదిరించడంతో దుండగుడు పరారీ

పోటీలో నిలుస్తారని వణుకు ....

పోటీలో నిలుస్తారని వణుకు ....

యూరప్ లోకి చైనా, టర్కీ, ఇండియన్ల ప్రవేశానికి అనుమతిస్తే తమకే నష్టమని పేర్కొన్నారు. తమ ప్రధాన శత్రువులైన ఈ దేశాల అభివృద్ధి యూరప్ కు విఘాతంగా మారుతోందని అంచనా వేశారు. దీంతో ఆ సమయంలో యూరప్ కు .. ఈ మూడు దేశాలతో ప్రచ్ఛన్న యుద్ధం జరుగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పుడు తమ ప్రత్యర్థి దేశాలే డామినేట్ చేసే సిచుయేషన్ వస్తోందని .. అందుకే దాడికి తెగబడినట్టు చెప్పకనే చెప్పాడు. ఈ 74 పేజీల మేనిఫెస్టో ప్రశ్న, సమాధానం మాదిరిగా రూపొందించాడు. అందులో భాగంగానే మసీదులపై దాడి చేయాలనే ప్రణాళిక రచించి .. దాడికి తెగబడ్డాడు.

English summary
In the 74-page manifesto he left behind after gunning down 49 people who were attending Friday prayers in two mosques in Christchurch in New Zealand, 28-year-old Brenton Tarrant talks about an “invasion ” from India, along with China and Turkey, and defines the three countries as “potential nation enemies in the East”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X