ట్రంప్ ఆగ్రహానికి గురైనా అనుహ్యంగా ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగింది
అమెరికా:ఎన్నికల సమయంతో పాటు, అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొన్నప్పటికీ తన కవరేజీ సరిగా లేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పెద్ద ఎత్తున పాఠకులను కోల్పోవాల్సి వస్తోందని ట్రంప్ విమర్శలు గుప్పించాడు.వారం రోజుల్లో న్యూయార్క్ టైమ్స్ పత్రికపై ట్రంప్ విమర్శల దాడి చేశాడు.
అవకాశం వచ్చినప్పుడల్లా న్యూయార్క్ ైమ్స్ పత్రికపై ట్రంప్ విరుచుకుపడ్డారు. వారంలో ఆరు దఫాలు పత్రికపై విమర్శలు చేశాడు. ట్వీట్ల వర్షం కురిపించాడు.అయితే తమ పత్రికకు పాఠకుల సంఖ్య పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. డిజిట్ న్యూస్ ప్రొడక్ట్స్ తో పాటు పత్రిక సర్క్యులేషన్ కూడ 41 వేలు పెరిగిందని ప్రకటించింది.
2011 తర్వాత అత్యధికంగా సర్క్యులేషన్ పెరిగిందని ఆ పత్రిక ప్రకటించింది.తొలి మూడుమాసాల్లో ఈ పత్రిక భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. కాని, ఇటీవల మాత్రం అత్యధికంగా సర్క్యులేషన్ పెరిగిందన పత్రిక ప్రకటించింది.1,16 లక్షల మంది కొత్త పాఠకులతో 13 మిలియన్ సభ్యత్వాలకు చేరుకొన్నట్టు పత్రిక ప్రకటించింది.
ఎన్నికల్లో తనకు సక్రమంగా కవరేజీ ఇవ్వని ఓ పత్రికపై డొనాల్డ్ ట్రంప్ విమర్శల వర్షం కురిపించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ పత్రిక సర్క్యులేషన్ తగ్గుతోందని ట్రంప్ చెప్పాడు. కాని, ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగింది.