వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ladakh standoff: చైనాతో మళ్లీ చర్చలు -డ్రాగన్ ఒకే చెప్పిందన్న కేంద్రం -అరుణాచల్‌లో గ్రామంపై..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గత జూన్ లో తూర్పు లదాక్ లోని గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం, యుద్ధ పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. సరిహద్దులో తిరిగి సాధారణ స్థితి నెలకొనేలా సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. కాగా, రెండు దేశాలు మరోసారి చర్చలు సిద్ధమయ్యాయి..

Recommended Video

#Indiachinastandoff: Breakthrough in India-China Talks | Oneindia Telugu

లదాక్ సహా ఎల్ఏసీ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోయే దిశగా మళ్లీ చర్చలు కొనసాగించాలని భారత్-చైనాలు అంగీకారానికి వచ్చినట్లు మన దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను వెల్లడించారు..

RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనాRBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

india-china-to-hold-next-round-of-senior-commander-level-talks-soon-mea

భారత్, చైనా సైన్యాలకు చెందిన సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య తదుపరి రౌండ్ చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇందుకోసం దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఇరువర్గాలు సంభాషణను కొనసాగిస్తున్నాయని శ్రీవాస్తవ చెప్పారు.

సరిహద్దు సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం భారత్, చైనాల మధ్య 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్' ఒప్పందం కొనసాగుతోన్న దరిమిలా చివరిసారిగా డిసెంబర్ 18న రెండు దేశాల సైనిక అధికారులు చర్చలు జరిపారు. దాదాపు 40 రోజుల గ్యాప్ తర్వాత తదుపరి రౌండ్ చర్చలుంటాయన్న ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే..

షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టుషాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు

india-china-to-hold-next-round-of-senior-commander-level-talks-soon-mea

అరుణాచల్‌ ప్రదేశ్‌లో.. మన భూభాగంపై చైనా కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల వచ్చిన వార్తను భారత ప్రభుత్వం ఖండించనప్పటికీ, అధికార బీజేపీ నేతలు అది అవాస్తవమని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై చైనా వివరణ ఇచ్చింది. గ్రామాన్ని తమ భూభాగంలోనే నిర్మించుకున్నామని, అవి కూడా సాధారణ నిర్మాణాలేతప్ప సైనిక వసతులు కావని చైనా పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా పేర్కొంటుండగా, దాన్ని నూటికి నూరుశాతం ఖండిస్తోన్న భారత్.. అరుణాచల్.. భారత్ లో అంతర్భాగమని చైనాను పలు మార్లు హెచ్చరించింది.

English summary
India and China have agreed to hold the next round of the senior commander levels meeting soon, the Ministry of External Affairs (MEA) said today. MEA spokesperson Anurag Srivastava said that the two sides are in close communication through diplomatic and military channels for holding the next round of senior commander levels meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X