స్నేహం కొనసాగాలి: పుతిన్తో ప్రధాని మోడీ భేటీ
సోచీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రష్యాలో పర్యటించారు. సోమవారం ఉదయం రష్యాలోని సోచీ చేరుకున్న ప్రధాని మోడీకి.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం నరేంద్ర మోడీ, పుతిన్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్, రష్యా బంధం చాలా ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పారు. సోచీకి ఆహ్వానించినందుకు పుతిన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్ఓసీలో భారత్కు శాశ్వత సభ్యత్యం వచ్చేందుకు రష్యా ఎంతగానో సహకరించిందన్నారు. ఇరు దేశాల మధ్య బంధం ఇలాగే కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
కాగా, భేటీ అనధికారికమని ఇరు దేశాలు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అనధికార పర్యటనలో సమావేశమయ్యారు.