ఆప్ఘన్లో భారత కాన్సులేట్పై దాడి, ఉగ్రవాదుల హతం
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్లో గల భారత దౌత్య కార్యాలయం పైన దాడి జరిగింది. ఉగ్రవాదులు ఒక్కసారిగా దౌత్య కార్యాలయంపై కాల్పులు జరిపారు. ఐటిబిపి, ఆఫ్ఘన్ దళాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ దాడిని తిప్పి కొట్టాయి.
ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చాలాసేపు కొనసాగాయి.. దాడి ఘటనను పర్యవేక్షించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు.
ఈ దాడి శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో అధికారులు ఎవరికీ గాయాలు కాలేదు. తుపాకులతో వచ్చిన ముగ్గురు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని పోలీసులు మొదట కాల్చి చంపారు. మిగిలిన ఒక్కడు ఆ తర్వాత కాల్పులు జరిపాడు. భారత దౌత్య కార్యాలయంలోనికి అతను చొచ్చుకు రాకుండా భద్రతా దళాలు అతనిని తిప్పి కొట్టాయి. కాసేపటికి మూడో గన్మెన్ను కూడా కాల్చి చంపాయి. కాగా, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యులమని ప్రకటించలేదు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్లో గల భారత దౌత్య కార్యాలయంపై దాడిని కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. తాను అక్కడి దౌత్యవేత్తలతో మాట్లాడానని మోడీ ట్విట్టర్లో స్పందించారు.