రెస్టారెంట్లో మనిషి మాంసం వండుతున్నారని!: యూకెలో కలకలం!..
హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. తమ బిజినెస్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరదీశారని ఆరోపించారు.
లండన్: బ్రిటన్ లో ఓ తప్పుడు ప్రచారం కలకలం రేపింది. యూకెలోని కర్రీ ట్విస్ట్ అనే భారతీయ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారన్న వదంతులు తీవ్రంగా వ్యాపించాయి. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం తీవ్రం కావడంతో.. హెటల్ బిజినెస్ తీవ్రంగా దెబ్బతిని, ఏకంగా మూతపడేదాకా వెళ్లింది.
నాన్ వెజ్ వంటకాల పేరుతో ఇండియన్ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారని పేర్కొంటూ.. ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారి.. జనమంతా నిజమేనని నమ్మేశారు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. తమ బిజినెస్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరదీశారని ఆరోపించారు.
ఈ ఫేక్ వార్తను నిజమేననుకుని నమ్మి.. కొంతమంది హోటల్ పై దాడికి కూడా యత్నించారని అన్నారు. గత 60ఏళ్లుగా తాము రెస్టారెంట్ నడుపుతున్నామని, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించలేదని చెప్పారు. ఓ ఫేక్ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తను నిజమనుకోవడమేంటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ బిజినెస్ ను దెబ్బతీయాలని ప్రచురించిన.. ఆ ఫేక్ వార్తలో అన్నీ స్పెల్లింగ్ మిస్టెక్సే ఉన్నాయన్నారు.