సంచలనం: బంగ్లాదేశ్లో తయారవుతున్న వేల కోట్ల భారత నకిలీ కరెన్సీ! (వీడియో)
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో ఏం ముద్రిస్తున్నారో తెలిస్తే షాక్ తినడం ఖాయం. ఇంతకీ ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఏం ముద్రిస్తున్నారో తెలుసా? మన దేశానికి చెందిన కరెన్సీ నోట్లు.
అవును, దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుందో తెలియదుకానీ అందులో కొన్ని వేల కోట్ల రూపాయల భారత కరెన్సీ ప్రింటింగ్ జరుగుతోంది.
రెండు వేలు, ఐదు వందలు నుంచి 50 రూపాయల నోట్ల వరకూ అక్కడ గుద్దేస్తున్నారు. అవి కూడా అచ్చం ఒరిజినల్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు తీశారో, ఎవరు తొలుత సోషల్ మీడియాలో పోస్టు చేశారో తెలియదు.
కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని సరిహద్దులు దాటించి, భారత్ లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటిని ప్రింట్ చేస్తున్న వారి లక్ష్యమని వేరే చెప్పనక్కర్లేదు. మరి మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి!