వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజిప్టులో ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీ కొన్న బస్సులు, ఆరుగురి మృతి, భారతీయుడు కూడా..

|
Google Oneindia TeluguNews

ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐన్ సోఖ్నా రిసార్ట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులను ట్రక్కు ఢీకొంది. బస్సులు ఒకదానికికొకటి ఢీకొనడంతో కుదుపునకు గురై.. ఆరుగురు చనిపోయారు. బస్సుల్లో ఉన్న 24 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

మృతుల్లో మలేసియాకు చెందిన మహిళ పర్యాటకులు, ఇండియాకు చెందిన పర్యాటకుడు, ముగ్గురు ఈజిప్టు దేశస్థులు ఉన్నారు. ముగ్గురిలో బస్సు డ్రైవర్, టూరిస్ట్ గైడ్, సెక్యూరిటీ ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. గాయపడ్డ 24 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Indian Killed In Bus Accident In Egypt, 16 Tourists Were On Board

ఈజిప్టులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. రహదారులు సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణం అని తెలుస్తోంది. దీంతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతుంటాయి. వేగ నియంత్రణ కూడా సరిగా సరిగ్గా ఉండకపోవడంతో రోడ్డు ప్రమాదాలతో మృతుల సంఖ్య పెరుగుతోంది.

2018లో 8048 ప్రమాదాలు జరగగా అంతకుముందు సంవత్సరం 11 వేల 98 మంది యాక్సిడెంట్లు జరిగాయని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొన్నది. రోడ్డుప్రమాదాల వల్ల 2016లో 5వేల మంది, 2017లో 3747, 2018లో 3087 మంది చనిపోయారని నివేదిక తెలిపింది.

English summary
A road crash in Egypt killed six people, including tourists from India and Malaysia, and injured at least 24 others Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X