యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతి
లండన్: బర్మింగ్హామ్ సమీపంలోని హ్యాండ్స్వర్త్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఓ కారు వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
తొలిసారి: కుల్భూషణ్ జాదవ్ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్
గత కొంత కాలంగా యూకేలో నివసిస్తున్న 29ఏళ్ల రాజేష్ చంద్.. శనివారం తెల్లవారుజామున 4గంటలకు రోడ్డు దాటుతున్న సమయంలో.. అతి వేగంతో వస్తున్న ఓ కారు అతడ్ని ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మిడ్లాండ్స్ పోలీసులు 30ఏళ్ల ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు.
బ్లాక్ ఆడి ఏ4ఎస్ లైన్ ఎస్టేట్ కారు ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఎన్జే60యూఓఎక్స్ అని తెలిపారు. ఈ కారును ఎవరికి, ఎక్కడ కనిపించినా తమకు వెంటనే సమాచారం అందించాలని మిడ్ లాండ్స్ పోలీసులు కోరారు.
దర్యాప్తునుకు రాజేష్ కుటుంబసభ్యులు అవసరమైన సహకారం అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుడ్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.