వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతి

|
Google Oneindia TeluguNews

లండన్: బర్మింగ్‌హామ్ సమీపంలోని హ్యాండ్స్‌వర్త్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఓ కారు వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్

గత కొంత కాలంగా యూకేలో నివసిస్తున్న 29ఏళ్ల రాజేష్ చంద్.. శనివారం తెల్లవారుజామున 4గంటలకు రోడ్డు దాటుతున్న సమయంలో.. అతి వేగంతో వస్తున్న ఓ కారు అతడ్ని ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మిడ్‌లాండ్స్ పోలీసులు 30ఏళ్ల ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు.

Indian-Origin Man Killed In Hit-And-Run While Crossing Road in UK

బ్లాక్ ఆడి ఏ4ఎస్ లైన్ ఎస్టేట్ కారు ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఎన్‌జే60యూఓఎక్స్ అని తెలిపారు. ఈ కారును ఎవరికి, ఎక్కడ కనిపించినా తమకు వెంటనే సమాచారం అందించాలని మిడ్ లాండ్స్ పోలీసులు కోరారు.

దర్యాప్తునుకు రాజేష్ కుటుంబసభ్యులు అవసరమైన సహకారం అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుడ్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

English summary
A 29-year-old Indian-origin man was killed when he was struck by a car which failed to stop at the scene in Handsworth near Birmingham.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X