కాలిఫోర్నియాలో కాల్పులు ఇండియన్ స్టూడెంట్ ధరమ్ ప్రీత్ మృతి
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఇండియాకు చెందిన ప్రవాస భారత విద్యార్థి ధరమ్ ప్రీత్ జస్సేర్ మరణించారు. ధరమ్ ప్రీత్ జస్సేర్ విధులు నిర్వహిస్తున్న దుకాణం పక్కనే ఉణ్న గ్యాస్ స్టేషన్ వద్ద నలుగురు దుండగులు దోచుకొనేందుకు వచ్చారు. అయితే దుండగులను చూసిన ధరమ్ ప్రీత్ జస్సేర్పై కాల్పులు జరిపారు. దీంతో ధరమ్ అక్కడికక్కడే చనిపోయారు.
. ఆయన పని చేసే దుకాణం పక్కనున్న గ్యాస్ స్టేషన్ ను దోచుకునేందుకు నలుగురు దుండగులు వచ్చారు. వారిని చూసిన ధరమ్ ప్రీత్ జస్సేర్ తన దుకాణంలోని క్యాష్ కౌంటర్ వద్ద దాక్కున్నాడు. అతనిని గుర్తించిన దుండగుడు తుపాకీతో కాల్చగా ప్రాణం కోల్పోయాడు. మరుసటి రోజు సరకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
గ్యాస్ స్టేషన్ లో రికార్డైన సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను భారతసంతతికి చెందిన అత్వాల్ (22) కావడం విశేషం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ జస్సేర్ మూడేళ్ల క్రితం చదువుకునేందుకు విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లారు.