జాక్పాట్: అబుదబీలో రూ.18 కోట్ల లాటరీ గెలిచిన భారతీయుడు, 9మందిలో 5గురు ఇండియన్స్
అబుదబీ: విదేశాల్లో నివసిస్తున్న ఓ భారతీయుడు యూఏఈలోని ఓ లాటరీలో జాక్పాట్ కొట్టాడు. రూ.18 కోట్లకు పైగా మొత్తాన్ని ఈ లాటరీలో గెలిచాడు. డిక్సన్ కట్టిథర అబ్రహమ్ నైజీరియాలో ఉంటున్నాడు. ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఇతను అబుదబీలోని బిగ్ టిక్కెట్ కొనుగోలు చేశాడు.
ఈ లాటరీ అతనికి తగిలింది. అబుదబీ కరెన్సీ ప్రకారం 10 మిలియన్ల దిర్హమ్లు గెలుచుకున్నాడు. అది మన లెక్క ప్రకారం రూ.18,22,25,000. అంటే 18 కోట్లకు పైగా అతను గెలుచుకున్నాడు.
అతను ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు అబుదబీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగమన విభాగం హాలులో ఆదివారం పదేపదే ప్రకటన చేశారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రా తీసే బిగ్టికెట్ అబూదాబీకి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ ఉంది. తాజా డ్రాలో డబ్బు గెలుచుకున్న తొమ్మిది మందిలో ఐదుగురు భారతీయులు, ముగ్గురు పాకిస్థాన్వారు, ఒకరు యూఏఈకి చెందిన వారు ఉన్నారు.