వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డొక్లామ్: సరిహద్దు గ్రామ ప్రజల్ని తరలిస్తున్న సైన్యం, అందుకేనా?
డొక్లామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీజింగ్: డొక్లామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సైన్యం మోహరించి ఉన్న డొక్లామ్ సరిహద్దుకు కేవలం 35 కి.మీ దూరంలో నతాంగ్ గ్రామం ఉంది.
కాస్త చదవండి: డొక్లాంపై చైనాకు భూటాన్ దిమ్మతిరిగే షాక్, యుద్ధమా.. ఆ గ్రామం ఖాళీ!
అందులో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ సైన్యం వారిని ఖాళీ చేయిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డొక్లామ్ సరిహద్దులో పహారా కాసేందుకు వచ్చిన సైన్యం ఉండేందుకు ముందస్తుగా గ్రామ ప్రజలను తరలించి ఉంటారని అంటున్నారు. ఆ గ్రామంలో 100 మంది వరకు ఉంటారు.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. సెప్టెంబరులో జరిగే వార్షిక సైనిక విన్యాసాల కోసం ముందస్తుగా గ్రామస్థులను ఖాళీ చేయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Comments
chinese military india missile target china south base india china border standoff tibet bhutan doklam చైనా భారత్ ఇండియా టిబెట్ భూటాన్ డోక్లామ్
English summary
Amidst the Doklam Standoff, several villagers at the Nathang villlage have been asked to vacate their homes immediately. This village is around 35 kilometres from the site.
Story first published: Thursday, August 10, 2017, 15:11 [IST]