ఇండోనేసియా భూకంపం, సునామీ: 1,.407 మంది వరకు మృతి
జకర్తా: ఇండోనేసియాలో ఇటీవల సంభవించిన భూకంపం, సునామీ కారణంగా భారీ విధ్వంసంతో పాటు ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 1,407కు చేరుకుంది. ఈ మేరకు డిజాస్టర్ ఏజెన్సీ వెల్లడించింది.
వరుసగా రెండు భూకంపాలు రావడంతో భారీ సునామీ హఠాత్తుగా విరుచుకుపడింది. దీంతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. బీచ్ ఫెస్టివెల్ జరుపుకుంటున్న ఎంతోమందిని సునామీ సముద్రంలోకి లాక్కెళ్లింది. శిథిలాల కింద కూడా ఎంతోమంది చనిపోయారు.
ఇండోనేసియా హీరో: భూకంపం ధాటికి టవర్ ఊగుతున్నా వందలాదిమందిని కాపాడి, మృతి
సహాయ సిబ్బంది ఇంకా సహాయక చర్యలు చేపడుతోంది. పాలూ నగరంలోనే ఎక్కువ మంది చనిపోయారు. దీంతో ఈ నగరం మొత్తం శవాల దిబ్బగా కనిపిస్తోంది. ఎంతోమందిని సామూహికంగా ఖననం చేశారు.
సులవేసి నగరంలో దాదాపు రెండు లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్య రాజ్య సమితికి చెందిన అధికారులు తెలిపారు. 66వేల ఇళ్లు కూలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ప్రజలు ఆహారం, నీరు కోసం తపిస్తున్నారు.