బాంబు బెదిరింపు: విమానం అత్యవసర ల్యాండింగ్
జకర్తా: ఇండోనేషియాకు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది. ఇండోనేషియాలోని అంబోన్ నగరం నుంచి 125 మందితో ఈ విమానం ప్రయాణిస్తోంది.
విమానాన్ని సౌత్ సులవేసి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్లు ఇండోనేషియా రవాణా అధికార ప్రతినిధి జేఏ బరతా వెల్లడించారు. బాంబు తనఖీ బృందం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబులేదని లేదని తేల్చినట్టు తెలిపారు. అది తప్పుడు ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పారు.
ఆ విమానం బటిక్ ఎయిర్ ప్లేన్. బెదిరింపు సందేశం టెక్స్ట్ రూపంలో వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశామన్నారు. ఈ సంఘటన శుక్రవారం నాడు ఉదయం జరిగింది. బటిక్ ఎయిర్.. లయన్ గ్రూప్లో ఓ భాగం. ఇది ఇండోనేషియాలో తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని కల్పించే అతి పెద్ద సంస్థ.