అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...
ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెందిన 17మందిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో పాటు అందులో కొంతమందికి ఉరిశిక్ష కూడ విధించినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ద వాతవరణం నెలకోంది.
ముఖ్యంగా గత మేలో ఇరాన్పై అమేరికా ఆంక్షలను తీవ్ర తరం చేసింది. ఈ నేపథ్యలంలోనే పాశ్చాత్య దేశాలకు ఇరాన్కు మధ్య తీవ్ర అంతర్యుద్దం కొనసాగుతోంది. దీంతో గత వారం బ్రిటన్కు చెందిన అయిల్ ట్యాంకర్ను సముద్ర జలాల నిబంధనలు ఉల్లంఘించిందని ఇరాన్ స్వాధినం చేసుకుంది. ఈనేపథ్యంలోనే అరెస్టుల పర్వం కూడ కొనసాగింది.
ఈనేపథ్యంలోనే ఇరాన్ అదుపులోకి తీసుకున్న గుఢాచారులు, అంత్యంత ప్రాధాన్య రంగాలలైన ఆర్ధిక, అణు ,మిలిటరీ, సైబర్ రంగాల్లో విధులు నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారని ఇరాన్ ఓ ప్రకటనలో తెలిపినట్టు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.