గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్పై దాడి చేస్తామని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ
గత ఏడాది ఇరాన్ మిలటరీ కమాండర్, మేజర్ జనరల్ కాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన ఒక సందేశాన్ని ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమైనీ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసారు.
డోనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, పైనుంచి యుద్ధవిమానం లేదా పెద్ద డ్రోన్ వెళుతుంటే ఆ నీడ ఆయన మీద పడినట్లు ఉన్న ఫొటో అయతొల్లా అలీ ఖమైనీ అధికారిక వెబ్సైట్లో ఉంది.
ఈ ఫొటోకు "ప్రతీకారం తప్పదు" అనే శీర్షిక కూడా పెట్టారు.
ఈ ఫొటోను మొట్టమొదట పోస్ట్ చేసిన @khamenei_site అనే అకౌంట్ను ట్విట్టర్ రద్దు చేసింది. ఈ అకౌంట్ ఫేక్ అని, ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించిందని ట్విట్టర్ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకి తెలిపారు.
అయితే, ఆ ట్వీట్ను అయతొల్లా ఖమైనీ పార్శీ ట్విట్టర్ అకౌంట్నుంచీ రీట్వీట్ చేసారు. ఈ అకౌంట్కు 3,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, తరువాత ఈ ట్వీట్ను కూడా తొలగించారు.
పార్శీలో రాసిన ఆ సందేశంలో "ప్రతీకారం" అనే పదం ఎర్ర రంగులో ఉంది.
"సులేమానీని హత్య చేసినవారు, ఆ హత్యను ఆదేశించినవారు మూల్యం చెల్లింక తప్పదు" అని పార్శీ భాషలో రాసి ఉంది.
అయతొల్లా ఖమైనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫొటో ప్రముఖంగా కనిపించేట్లు ఉంది. ఫొటో పక్కన, డిసెంబర్ 16న ఖమైనీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ "ఏ సమయంలోనైనా జరగవచ్చు" అని రాసి ఉంది.
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?
- ఇరాన్ సుప్రీం లీడర్: అయతొల్లా అలీ ఖమైనీ వారసుడెవరు?
https://twitter.com/sebusher/status/1352647779324223489
ఈ నేపథ్యంలో ఇరాన్ నేత ట్విట్టర్ అకౌంట్ రద్దు చేయాలంటూ పలువురు వినియోగదారులు ట్విట్టర్ను కోరారు.
ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అకౌంట్ను ట్విట్టర్ రద్దు చేసింది. మరి ఇరాన్ నేత విషయంలో ఎందుకు ఉపేక్షిస్తోందంటూ ట్విట్టర్ యూజర్స్ ప్రశ్నిస్తున్నారు.
"మాజీ అమెరికా అధ్యక్షుడిని హతమార్చాలంటూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయగలరు? అలాంటి వ్యాఖ్యలు చేసినవారిని ట్విట్టర్ ఎందుకు ఉపేక్షిస్తోంది?" అని ఒక యూజర్ ఇంగ్లిష్లో ట్వీట్ చేసారు.
"ట్రంప్ అకౌంట్ తొలగించారు. కానీ ఈ అకౌంట్ మాత్రం ఉంచారు. ఇదేమైనా జోకా?" అని మరొకరు ట్వీట్ చేసారు.
మేజర్ జనరల్ కాసిం సులేమానీని గత ఏడాది బాగ్దాద్లో ఒక అమెరికా డ్రోన్ హతమార్చింది.
సులేమానీ నాయకత్వంలో ఇరాన్ అనుకూల మిలిటెంట్ బృందాలకు ఆ దేశం మద్దతు ఇచ్చింది. ఇరాక్, సిరియాలలో తమ సైనిక స్థావరాలను విస్తరించింది. సిరియాలో జరుగుతున్న దీర్ఘకాలిక అంతర్యుద్ధంలో తిరుగుబాటు బృందాలపై సిరియా చేసిన దాడిని ఇరాన్ నిర్దేశించింది.
జనరల్ సులేమానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా లక్షలమంది చావుకు కారణమయ్యారని అప్పట్లో ట్రంప్ అన్నారు.
ఇందుకు ప్రతిగా, ఇరాక్ ఎయిర్బేస్లో ఉన్న అమెరికా దళాలపై ఇరాన్ వరుసగా మిసైల్స్ ప్రయోగించింది. ఇలాంటివే మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించింది.
దానికి తోడు, "నేరస్థులపై తీవ్రమైన ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది" అని జనరల్ సులేమానీ వ్యాఖ్యానించారు.
అమెరికా, బ్రిటన్లలో అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సీన్లు "నమ్మదగినవి కావు" అంటూ ఈ నెల ప్రారంభంలో అయతొల్లా ఖమైనీ చేసిన ట్వీట్ను ట్విట్టర్ తొలగించింది.
ఇవి కూడా చదవండి:
- కాసిం సులేమానీ హత్య ఐఎస్కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల 'పంచాయితీ’: ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్కి దూరంగా అధికారులు, హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: 'కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)