సిడ్నీ కేఫ్లో బంధించబడ్డ వారిలో ఇండియన్స్, తప్పించుకున్న ఐదుగురు!
సిడ్నీ: ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోని మార్టిన్ ప్లెన్లోని ఓ కేఫ్లో అగంతకుడు 12కు పైగా మందిని సోమవారం ఉదయం నిర్బంధించాడు. వెంటనే స్పందించిన న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కేఫ్ పరిసరాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. బందీలను విడిపించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. కాగా, వారిని ఇస్లామిక్ స్టేట్ గన్మెన్ బంధించినట్లుగా భావిస్తున్నారు. ఆ కేఫ్ పేరు లాండ్ట్ చాకోలేట్ కేఫ్.
ఈ కేఫ్ కిటికీ ద్వారా బంధించబడిన వారిలో ముగ్గురు బయటకు కనిపిస్తున్నారు. ఈ ప్రాంతం బిజీగా ఉండే ప్రాంతం. ఆ కేఫ్ పైన ఇస్లామిక్ స్టేట్ జెండాను ఉంచారని టీవీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో వారు ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.
కాగా, బందీల్లో ఐదుగురు తప్పించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బందీల్లో భారతీయులు కూడా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియన్ కాన్సులేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు.
కలచివేస్తోంది: మోడీ
The
incident
in
Sydney
is
disturbing.
Such
acts
are
inhuman
&
deeply
unfortunate.
I
pray
for
everyone's
safety.
—
Narendra
Modi
(@narendramodi)
December
15,
2014
ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ కేఫ్లో పన్నెండుమందికి పైగా దుండగుడు బంధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఆయుధాలు ధరించిన ఆ వ్యక్తి వీరందరిని బంధించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
విద్రోహ శక్తుల చేతిలో సామాన్యులు ప్రాణాపాయస్థితిలో ఉండటం కలచివేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చతెచ్చేలా ఉందన్నారు. బంధీలుగా ఉన్న ప్రతి ఒక్కరు క్షేమంగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.