6ఏళ్లు లాడెన్ను బంధించి అమెరికాకు పాక్ అప్పగింత
లండన్: అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ ఆరు సంవత్సరాల పాటు ఖైదీగా బంధించి ఓ కల్పిత ఆపరేషన్లో అమెరికాకు అప్పగించిందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బీబీసీ నివేదిక ఇదే విషయం పేర్కొంది.
బిన్ లాడెన్ హత్యకు సంబంధించి పాకిస్తాన్, అమెరికా ప్రభుత్వాలు పైస్థాయిలో కుట్ర చేశాయని అల్ ఖైదా, లాడెన్ పైన రెండు దశాబ్దాల పాటు పరిశోధనాత్మక కథనాలు రాసిన బీబీసీ పాత్రికేయురాలు జేన్ కార్బిన్ నివేదించారు.
బిన్ లాడెన్ను ఆరేళ్ల పాటు అబోట్టాబాదులోని గారిసన్ పట్టణంలో బంధించి అమెరికాకు అప్పగించినట్లు నివేదిక తెలిపింది. బిన్ లాడెన్ స్థావరాన్ని చూపించేందుకు పాక్ నిఘా అధికారి సీఐఏ నుంచి 25 మిలియన్ డాలర్లు తీసుకున్నట్లు తెలిపింది.
అయితే, సీఐఏ మాత్రం ఈ నివేదికలో నిజం లేదని, పాకిస్తాన్కు తెలియకుండానే ఆఫరేషన్ పూర్తి చేశామని చెప్పింది. లాడెన్ హత్య ఓ కట్టుకథలా ఉందని మరో పరిశోధనాత్మక పాత్రికేయులు సీమా హెర్ష్ ఇదివరకే చెప్పారు.