ఐఎస్ఐఎస్ ఘాతుకం: మంత్రాలు చేస్తున్నాడని బహిరంగంగా తల నరికేశారు
తిక్రిక్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో దారుణానికి పాల్పడింది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని ప్రజల మధ్యలో కూచోబెట్టి తలనరికేశారు. ఈ ఘటన ఇరాక్ దేశంలోని తిక్రిత్ పట్టణంలో చోటు చేసుకుంది. తిక్రిత్ను ఇరాక్ సైన్యం చేసుకున్నప్పటికీ అక్కడే తిష్టవేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు.
తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ నడి వయస్కుడిని నడిబజారులో తల నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించడం విచారకరం. కాగా, ఆ దృశ్యాలను ఫొటోలు తీసి సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పోస్టు చేశారు ఉగ్రవాదులు.
'డీ గెర్రీ అబూ బకర్ అల్ బ్రిటాని'గా చెప్పుకుంటున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన రెండు ఫొటోల్లో ఒకదానిలో నడివయస్కుడు జంతువులను హలాల్ చేసే మొద్దు మీద తల పెట్టి ఉండగా, నల్ల దుస్తులు ధరించిన ఉగ్రవాది 18 అంగులాల కత్తి పెకైత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు.
రెండో ఫొటోలో రక్తం ఓడుతున్న ఆ వ్యక్తి మొండెం, దాని వెనకే తెగిపడిన తలకాయ కనిపిస్తోంది. చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కూడా ఎంతో మందికి సున్నీ ఉగ్రవాదులు ఇలాంటి దారుణ శిక్షలు విధిస్తున్నారు. అనేక మంది అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.