వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐసిస్ కొత్త జిహాదీ జాన్గా భారత సంతతి హిందువు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఉగ్రవాద సంస్థ ఐసిస్లో సీనియర్ కమాండర్గా ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల చేత చిక్కి, లైంగిక బానిసగా నరకయాతన అనుభవించిన ఓ యువతి తెలిపిన వివరాలను ఉటంకిస్తూ.. కథనాలు వస్తున్నాయి.
బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఇస్లాంను స్వీకరించి అబూ రుమయ్సాహ్గా పేరు మార్చుకున్నాడు. బ్రిటన్లో తన పైన పలు కేసులు ఉన్నప్పటికీ... పోలీసులకు చిక్కకుండా 2014లో తన భార్య, పిల్లలతో కలిసి సిరియా చేరుకొని ఐసిస్లో చేరాడు.
కొత్త జీహాదీ జాన్గా అతడు పేరొందాడు. ఐసిస్లో ప్రస్తుతం అతను సీనియర్ కమాండర్ హోదాలో ఉన్నాడు. కొత్త జిహాదీ జాన్ సిద్దార్థ ధర్.. మంచినీళ్లు తాగినంత సులభంగా మనుషుల గొంతు కోసి చంపే జిహాజీ జాన్గా భారతీయ హిందువు వ్యవహరిస్తున్నాడని తేలడం గమనార్హం.
English summary
Isis sex slave kidnapped by British 'new Jihadi John' suspect Siddhartha Dhar.
Story first published: Tuesday, May 3, 2016, 12:59 [IST]