వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలిటెంట్‌తో పెళ్లికి నో చెప్పిన యువతిని..: ఐసిస్ ఘాతుకం

|
Google Oneindia TeluguNews

ఇరాక్: ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. మిలిటెంట్‌ను పెళ్లి చేసుకోనందుకు ఓ మహిళను అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన మహిళ ఇరాక్‌కు చెందినది.

ఐసిస్ ఆధీనంలో ఉన్న ఇరాక్‌లోని మోసూల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల అరాచకాలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై వారు దారుణాలకు పాల్పడుతున్నారు. నగరంలో 32 ఏళ్ల మహిళను ఒక ఇస్లామిక్‌ ఉగ్రవాది వివాహం చేసుకోవాలని కోరాడు. ఇందుకు మహిళ తల్లిదండ్రులు అంగీకరించారు.

ISIS Terrorists Stone to Death Iraqi Woman for Refusing to Marry Militant

కానీ మహిళ అందుకు నో చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన ఐసిస్ ఉగ్రవాదులు ఆమె వ్యభిచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ షరియత్‌ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రాళ్లతో కొట్టి చంపాలని కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు నగర ప్రజలను బయటకు తీసుకు వచ్చి.. వారి ముందు ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు.

English summary
ISIS terrorists have executed an Iraqi woman after accusing her of committing adultery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X