వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జిని కిడ్నాప్ చేసి చంపేసిన ఐఎస్ఐఎస్

|
Google Oneindia TeluguNews

లిబియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు సైనికులు, పోలీసులు, స్థానిక ప్రజలను చిత్రహింసలకు గురి చేసి దారుణంగా చంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక కోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేశారు.

మహమ్మద్-ఉల్-నమ్లి ఆనే జడ్జి హత్యకు గురైనారు. లిబియాలోని అల్ కోమ్స్ అప్పీల్ కోర్టులో మహమ్మద్-ఉల్- నమ్లీ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఇటివల ఆయన సిర్టి అనే నగరంలో ఉన్న విషయం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు గుర్తించారు.

తరువాత సాయుధ బలగాల (సైనికుల) దుస్తులలో వెళ్లిన ఉగ్రవాదులు న్యాయమూర్తిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అనేక విధాలుగా న్యాయమూర్తిని విడిపించడానికి ప్రయత్నాలు చేసింది.

 Islamic State kills captured judge in Libya

అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు న్యాయమూర్తి మహమ్మద్ ను చిత్రహింసలకు గురి చేసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి హరావా అనే పట్టణంలో విసిరివేసి వెళ్లారు.

విషయం గుర్తించిన ప్రభుత్వం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి మహమ్మద్ హత్యకు గురైనారని లిబియన్ జ్యుడిషియల్ అర్గనైజేషన్ ధ్రువీకరించింది. ఉగ్రవాదులు చివరికి న్యాయమూర్తులను వదలకపోవడంతో జడ్జిలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

English summary
Islamic state (IS) affiliates in Libya have executed a judge who was abducted a week ago, the Libyan Judicial Organisation said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X