పాలస్తీనాకు ఇజ్రాయెల్: సొరంగం ధ్వంసం
జెరూసలేం: పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్ కాంక్రియస్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
హమాస్లో పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని దాని సాయంతోనే స్మగ్లింగ్ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ పైన దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారన్నారు.
గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటిని కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్ట్ వరకు ఉందన్నారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు.
గ్యాస్ పైప్ లైన్ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందే వారు వైమానిక దాడులు నిర్వహించారు.