సీరియల్ కిల్లర్ ఘాతుకం: ఆ అపార్ట్మెంట్లో తలలు, మొండాలే
జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు.
టోక్యో: జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. అతనున్న అపార్ట్మెంట్లో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
యువతి మిస్
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జమాలోని ఆ అపార్ట్మెంట్లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ కేసు నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు.
దిగ్భ్రాంతికి గురైన పోలీసులు
ఆ
సమయంలో
మహిళ
ఇంట్లో
లేకపోవటంతో
తాళాలు
పగలకొట్టి
సోదాలు
చేశారు.
ఓ
కూలర్
బాక్స్లో
ఉన్న
రెండు
మృతదేహాలను
స్వాధీనం
చేసుకున్నారు.
ఆ
తర్వాత
లోపలికి
వెళ్లిన
పోలీసులకు
భయానక
దృశ్యాలు
దర్శనమిచ్చాయి.
అక్కడ
కొన్ని
కూలర్
బాక్స్లలో
తల,
మొండాలు
వేర్వేరుగా
ఉన్న
కొన్ని
మృతదేహాలు
వారి
కంటపడ్డాయి.
దీంతో
ఒక్కసారిగా
దిగ్భ్రాంతికి
గురయ్యారు.
ఆ
మృతదేహాలన్నింటినీ
స్వాధీపరుచుకున్న
పోలీసులు..
అవి
ఎవరివో
గుర్తించే
పనిలో
పడ్డారు.
మృతదేహాల్లో 8మంది యువతులవే..
ఆ గదిలో మొత్తం 9 మృతదేహాలు(8మంది యువతులు, ఒక యువకుడి) లభ్యమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో షిరైషీ(27) అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ఓ జపాన్ పత్రిక తన కథనం ప్రచురింది.
సీసీ కెమెరాల్లో మిస్సైన యువతితో నిందితుడు..
కాగా, మొదట మిస్సయిన యువతి సూసైడ్ నోట్ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్లో తకహిరోతో కలిసి కనిపించిన ఫుటేజీలు దర్శనమిచ్చింది. దీంతో ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని ఆ పత్రిక కథనం లో పేర్కొంది. ఇంతమందిని ఎందుకు? ఎలా చంపారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల విచారణ పూర్తయితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.