పాక్ మిలటరీ హాస్పిటల్లో భారీ పేలుడు..గాయపడ్డవారిలో జైషే చీఫ్ మసూద్ అజర్?
రావల్పిండి : పాకిస్థాన్ రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయలయ్యాయని, అందులో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కూడా ఉన్నాడని ావర్తలు వచ్చాయి. దీనికి సంబంధించి రావల్పిండికి చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్సాన్ ఉల్లా మియాఖలీ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అజర్ ప్రస్తుతం మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పేలుడు జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో 10 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారందరినీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు అహ్సాన్ చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు మీడియాకు అనుమతివ్వలేదని అన్నారు.
అహ్సాన్తో పాటు మరికొందరు నెటిజన్లు ఈ ఘటనకు సంబంధించి పోస్ట్ చేసిన వీడియోలను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. హాస్పిటల్లో జరిగింది ప్రమాదం కాదని, ప్లాన్ ప్రకారం జరిగిన దాడేనని కొందరు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంత వరకు స్పందించలేదు. మిలటరీ హాస్పిటల్లో జరిగింది ప్రమాదమా లేక దాడి జరిగిందా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
Huge #blast at Military Hospital in #Rawalpindi, #Pakistan. 10 injured shifted to emergency.
— Ahsan Ullah MiaKhail (@AhsanUlMiakhail) June 23, 2019
Jaish-E-Mohammad Chief Maulana Masood Azahar is admitted here.Completely Media blackout by Army. Media asked Strictly not to cover this story@a_siab @nidkirm @GulBukhari @mazdaki pic.twitter.com/sTIYrJ7sAn