కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన
ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ పేలుడు ధాటికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 80మంది దాకా మృత్యువాత పడ్డ ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పేలుళ్లకు పాల్పడిందెవరు? అన్నదానిపై స్పష్టత లేకపోగా.. తాజాగా ఈ పనిచేసింది తామేనని ప్రకటించింది ఐసిస్.
కాబూల్ లో భారత్, జర్మనీ ఎంబాసీ వద్ద బాంబు దాడి ! మోడీ జర్మనీ పర్యటన, టెర్రర్ టార్గెట్ !
ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ పేలుడు ధాటికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారత, జర్మనీ రాయబారి కార్యాలయాలకు కేవలం 50 మీటర్ల దూరంలో మాత్రమే ఉండటం గమనార్హం.
ఈ పేలుడు ఘటనపై వెంటనే స్పందించిన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్రూమ్లకు తరలించారు.పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. భారత సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. అఫ్ఘనిస్థాన్కు వీలైనంత సాయం చేస్తామని భారత్ తెలిపింది.