హోటల్పై ఉగ్రవాదుల దాడి: పలువురి మృతి
కాబూల్: ఆఫ్ఘనస్థాన్లో ఉగ్రవాదులు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ ఫైవ్స్టార్ హోటల్ లో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు కాబూల్లోని ఫైవ్స్టార్ హోటల్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు సమాచారం.
కాబూల్లోని ఇంటర్ కాంటినెంటల్ ప్రసిద్ది చెందింది.. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు.
ఆపై గ్రేనేడ్ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్ హరిస్ నయబ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్ గ్రేనేడ్లతో హోటల్లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి.