‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’
హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనతో అన్నారు.
ప్రధాని మోడీ ప్రత్యేక కానుక: భారత్ పై యూన్ చీఫ్ ప్రశంసలు
జమ్మూకాశ్మీర్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీరీ పండిట్లతో అన్నారు. కాశ్మీరీ పండిట్ సురీందర్ కౌల్ మోడీతో భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు.
#WATCH United States: Prime Minister Narendra Modi joins in reciting 'Namaste Sharade Devi' shloka while the Kashmiri Pandits meeting and interacting with him also recite it, in Houston. pic.twitter.com/pXZdAuvEvG
— ANI (@ANI) September 22, 2019
జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని కాశ్మీరి పండిట్లు ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. కాశ్మీరీ పండిట్ల తరపున ప్రధానికి వినతి పత్రం సమర్పించామని చెప్పారు.
#WATCH United States: A delegation of Kashmiri Pandits meets and interacts with Prime Minister Narendra Modi. A member kisses PM Modi's hands and says, "Thank you on behalf of 7 Lakh Kashmiri Pandits." pic.twitter.com/8xKBqNlOvM
— ANI (@ANI) September 22, 2019
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ప్రగతి కోసం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది కాశ్మీరీ పండిట్ల తరపున ధన్యవాదాలు తెలిపామని వివరించారు.
నమో థాలీస్: భారత ప్రధాని కోసం హూస్టన్ చెఫ్ ప్రత్యేక మెనూ!
కాశ్మీర్ ను శాంతియుత ప్రాంతంగా మార్చి అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే ప్రధాని మోడీ కల నెరవేరేందుకు తాము కూడా సహకరిస్తామని ఈ భేటీలో కాశ్మీరీ పండిట్లు స్పష్టం చేశారు.