హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాం వజ్రాలతో మెరిసిన ప్రిన్స్ భార్య కేథరిన్

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ రాణి దగ్గర్నుంచి స్వీకరించిన ఓ అద్భుతమైన డైమండ్ నెక్లెస్‌ను ధరించిన బ్రిటన్ యువరాజు విలియమ్స్ సతీమణి కేథరిన్ అమితంగా ఆకట్టుకుంది. మంగళవారం లండన్‌లోని పొట్రియాట్ గ్యాలరీ విందులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన కేథరిన్ ఆ నెక్లెస్ ధరించడంతో పార్టీలో మెరిసిపోయారు. అయితే ఆమె ధరించిన ఆ నెక్లెస్ హైదరాబాద్ నిజాంలకు చెందినది కావడం విశేషం.

Kate Middleton

డార్క్ జెన్నీ ప్యాఖమ్ డ్రెస్ ధరించిన కేథరిన్, వజ్రాలు పొదిగిన ఆ నెక్లెస్‌ను వేసుకుని పార్టీకి హాజరయ్యారు. ఆ అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌ను హైదరాబాద్ నిజాం 1947లో అప్పటి బ్రిటన్ రాణి ఎలిజిబెత్-IIకి బహుమతిగా అందించారు. ఎలిజిబెత్ వివాహ సమయంలో ఈ నెక్లెస్‌ను ఆమెకు నిజాం అందించినట్లు సమాచారం. ఎలిజిబెత్ నుంచి ఆ నెక్లెస్ ఇప్పుడు కేథరిన్‌కు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి అనేక ఆభరణాల నిజాం కాలంలో అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ గాలా పార్టీకి ఇతర ప్రముఖులు ఎలిజిబెత్ హార్లీ, కళాకారులు బ్రియాన్ ఆడమ్స్, గ్రేసన్ పెర్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువరాణి కేథరిన్ మాట్లాడుతూ.. ఈ పార్టీలో తాను పాల్గొన్నందుకు ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. గ్యాలరీలోని సాధించిన విజయాలు అసాధారణంగా ఉన్నాయని ఆమె అతిథులకు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన చిత్రాలను ఇక్కడ ఉంచారని, అవన్ని వేటికవే అమితంగా ఆకట్టుకుటున్నాయని ఆమె తెలిపారు.

English summary
Prince William's wife Catherine dazzled onlookers at a dinner for London's National Portrait Gallery on Tuesday with a diamond necklace borrowed from the queen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X