నిజాం వజ్రాలతో మెరిసిన ప్రిన్స్ భార్య కేథరిన్
లండన్: బ్రిటన్ రాణి దగ్గర్నుంచి స్వీకరించిన ఓ అద్భుతమైన డైమండ్ నెక్లెస్ను ధరించిన బ్రిటన్ యువరాజు విలియమ్స్ సతీమణి కేథరిన్ అమితంగా ఆకట్టుకుంది. మంగళవారం లండన్లోని పొట్రియాట్ గ్యాలరీ విందులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన కేథరిన్ ఆ నెక్లెస్ ధరించడంతో పార్టీలో మెరిసిపోయారు. అయితే ఆమె ధరించిన ఆ నెక్లెస్ హైదరాబాద్ నిజాంలకు చెందినది కావడం విశేషం.
డార్క్ జెన్నీ ప్యాఖమ్ డ్రెస్ ధరించిన కేథరిన్, వజ్రాలు పొదిగిన ఆ నెక్లెస్ను వేసుకుని పార్టీకి హాజరయ్యారు. ఆ అద్భుతమైన వజ్రాల నెక్లెస్ను హైదరాబాద్ నిజాం 1947లో అప్పటి బ్రిటన్ రాణి ఎలిజిబెత్-IIకి బహుమతిగా అందించారు. ఎలిజిబెత్ వివాహ సమయంలో ఈ నెక్లెస్ను ఆమెకు నిజాం అందించినట్లు సమాచారం. ఎలిజిబెత్ నుంచి ఆ నెక్లెస్ ఇప్పుడు కేథరిన్కు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి అనేక ఆభరణాల నిజాం కాలంలో అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ గాలా పార్టీకి ఇతర ప్రముఖులు ఎలిజిబెత్ హార్లీ, కళాకారులు బ్రియాన్ ఆడమ్స్, గ్రేసన్ పెర్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువరాణి కేథరిన్ మాట్లాడుతూ.. ఈ పార్టీలో తాను పాల్గొన్నందుకు ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. గ్యాలరీలోని సాధించిన విజయాలు అసాధారణంగా ఉన్నాయని ఆమె అతిథులకు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన చిత్రాలను ఇక్కడ ఉంచారని, అవన్ని వేటికవే అమితంగా ఆకట్టుకుటున్నాయని ఆమె తెలిపారు.