అధ్యక్షుడిని సంతోష పెట్టేందుకు అమ్మాయిల బృందం సరఫరా
ఉత్తర కొరియా: నార్త్ కొరియన్ నియంత కిమ్ జాంగ్ ఉన్ సరికొత్త ఆదేశాలు జారీ చేశారు! తనను సంతోషపెట్టేందుకు ఓ ప్లెజర్ ట్రూప్ను ఏర్పాటు చేశారు. కిమ్ వయస్సు 32. ఉత్తర కొరియాలో మానవ హక్కులకు భంగం కలుగుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అతని ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఏకంగా అందమైన భామలనే సరఫరా చేయాల్సి ఉంటుంది! వారు అతనిని రాజును ఎంటర్టైన్ చేయాలి. అలా సరఫరా అయిన అమ్మాయిలను ప్లెజర్ ట్రూప్గా వ్యవహరిస్తారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడిని తమ సంతోష పెట్టడమే వీరి పని. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సుంగ్ ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆయన కుమారుడైన కిమ్ జోంగ్ ఇల్ 2011లో మరణించడంతో ఆయన నియమించుకున్న ప్లెజర్ ట్రూపును రద్దు చేసేశారు.
మూడేళ్లు అధికారిక సంతాప దినాలు కూడా ముగియడంతో ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్కు ప్లెజర్ ట్రూపును నియమించుకునే అర్హత వచ్చింది. దీనిపై అధికారులను ఆదేశించారు. అందమైన 30-40 మంది యువతులను ఎంపిక చేసుకుని, తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ప్యోంగ్యాంగ్కు తరలిస్తారు.