నిన్న పెప్పర్స్ప్రే: పార్లమెంట్లో టియర్ గ్యాస్, పరుగులు
కొసావో: కొసావో పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు పెప్పర్ స్ప్రే, టియక్ గ్యాస్తో గందరగోళం సృష్టిస్తున్నారు. కొసావో ప్రతిపక్ష సభ్యులకు ఇది సాధారణంగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా, సోమవారం నాడు పార్లమెంటులో టియర్ గ్యాస్ ప్రయోగించారు.
టియర్ గ్యాస్ మంటలకు మిగతా ఎంపీలు ఒక్కసారిగా పార్లమెంటు హాలు నుంచి పరుగులు తీశారు. కొందరు ఆసుపత్రి పాలయ్యారు. అంతకుముందు నవంబర్, సెప్టెంబర్ నెలల్లో ప్రతిపక్ష సభ్యులు పెప్పర్ స్ప్రే చల్లారు. తాజాగా అంతకుమించి, టియర్ గ్యాస్ ప్రయోగించడం గమనార్హం.
యూరప్ ఖండంలో గల కొసావో దేశం 2008లో సెర్భియా నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. రెండు దేశాల సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల పైన సెర్బియాకు అధికారాలు ఇస్తూ కొసావో ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నరు. దీనిని నిరసిస్తూ పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.