కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..
సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలింది. గురువారం భారత లాయర్లు పాక్ జైలులో జాదవ్ ను కలిశారు. కానీ తనతో ఫ్రీగా మాట్లాడనీయకుండా అడుగడుగునా ఆటంకాలు, అవాంతరాలు సృష్టించారు.
జాదవ్ ను కలిసిన లాయర్ల బృందం నుంచి ఈ మేరకు రిపోర్టు అందిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ మీడియాకు తెలిపారు. జాదవ్ న్యాయసహాయాన్ని నిరాకరించాడంటూ పాకిస్తాన్ ప్రచారం చేసిన మాట అవాస్తవమని వెల్లడైంది. అయితే, మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన సంతకాలు కూడా పెట్ట నీయకుండా పాక్ అధికారులు అనుచితంగా వ్యవహరించారని శ్రీవాస్తవ చెప్పారు. మరణ శిక్ష రివ్యూకు ఈనెల 20 తో గడువు ముగియనుండగా, జాదవ్ కు న్యాయ సహాయం విషయంలో పాక్ కల్పించిన అవకాశం అర్థంలేనిదిగా భావించాలని భారత అధికారులు అంటున్నారు.
ఏపీలో కొత్త జిల్లాలపై కిరికిరి.. తలోమాట.. వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..
పాకిస్తాన్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించాల్సిందేనని అంతర్జాతీయ కోర్టు ఆదేశించడంతో పాక్ ఈ మేరకైనా దిగొచ్చింది. గతేడాది సెప్టెంబర్ లో మొదటిసారి లాయర్లను కలిసే అవకాశమిచ్చిన పాక్.. మళ్లీ ఇన్ని నెలలల తర్వాతగానీ రెండో దఫా భేటీకి అనుమతించలేదు. జైలులో జాదవ్ తో మాట్లాడిన లాయర్ల బృందం పంపిన రిపోర్టును బట్టి.. రివ్యూ పిటిషన్ వేయకుండా ఆపేందుకు అక్కడి అధికారులు యత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. గడువులోగా పిటిషన్ పేపర్లపై జాదవ్ సంతకాలు చేసేందుకు పాక్ అనుమతివ్వని పక్షంలో భారత్ మరోసారి అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశముంది.
Recommended Video
కుల్ భూషణ్ కు న్యాయసహాయంపై భారత్ అభ్యర్థనను విచారించిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే).. పాక్ తీరును తీవ్రంగా ఎండగట్టడం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ కోర్టు జాదవ్ కు విధించిన మరణశిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఈనెల 20తో ముగియనుంది. గడువు వృధా అయ్యేలా పాక్ అనేక కుయుక్తులు పన్నింది. జాదవ్ కు న్యాయ సహాయం అందించకపోవడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగ్గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే పేర్కొన్న సంగతి విదితమే.