ఆలస్యంగా నిద్రపోతున్నారా?: 'డేంజర్'లో పడ్డట్టే, పరిశోధకుల హెచ్చరిక..
నిద్ర లేమి వల్ల తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు బ్రింగ్ హాటన్ యూనివర్సిటీ పరిశోధకులు.
లండన్: నైట్ లైఫ్ పెరిగిన తర్వాత రాత్రుళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోయేవారి సంఖ్య పెరిగింది. దానికి తోడు 24గం. స్మార్ట్ ఫోన్ లలో చాటింగులు కూడా పెరిగిపోవడంతో నిద్రపోయే సమయం చాలావరకు తగ్గిపోతూ వస్తోంది.
రాత్రి తక్కువ సేపు నిద్రపోవడం.. ఉదయాన్నే మళ్లీ ఉరుకులు పరుగుల మీద ఆఫీసులు, కాలేజీకి పరిగెత్తడం ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయింది. అయితే నిద్ర లేమి వల్ల తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు బ్రైటన్ యూనివర్సిటీ పరిశోధకులు.
ఆలస్యంగా నిద్రపోయేవారు మానసిక అనారోగ్యానికి(పిచ్చి పట్టడం) గురయ్యే అవకాశం ఉందంటున్నారు. హింసాత్మక ఆలోచనలు పెరిగిపోవడం, భయం లేకపోవడం, బాగా వాగుతుండటం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం వంటి ఆలోచనలు ముప్పిరిగొంటాయని చెబుతున్నారు.
మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 మందిని పరీక్షించిన అనంతరం వర్సిటీ పరిశోధకులు ఈ విషయాలను నిర్దారించారు. కాగా, నిద్ర లేమి వల్ల హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు, మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయన్న సంగతి తెలిసిందే.