వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనాలపై సింహం బీభత్సం: కాల్చి చంపేశారు(వీడియో)
నైరోబి: కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్లో నుంచి ఓ సింహం తప్పించుకుంది. పక్కనే ఉన్న జనావాసాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. అంతేగాక, కనిపించిన వారిపై పంజాను విసిరింది.
దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సింహం దాడిలో పదుల సంఖ్యలో పశువులకు గాయాలయ్యాయి. కాగా, సింహాన్ని బంధించాలన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేదేం లేక, అటవీ శాఖ అధికారులు ఆ సింహాన్ని కాల్చి చంపేశారు.
ఆ సింహాన్ని సజీవంగానే పట్టుకోవాలని యత్నించినప్పటికీ.. విఫలం కావడంతో తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపేయాల్సి వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. లేదంటే మరికొందరు సింహం బారిన పడేవారని చెప్పారు.
Comments
English summary
Wildlife officers in Kenya fatally shot one of the country’s best-known lions on Wednesday after their attempt to capture it alive attracted a crowd, whose presence upset the animal and led it to injure a bystander, the Kenya Wildlife Service said.
Story first published: Thursday, March 31, 2016, 12:48 [IST]