దారుణం: బతికున్న గాడిదను పులులకు ఆహరంగా ఇచ్చిన జూ. సిబ్బంది (వీడియో)
తూర్పు చైనాలోని చాంగ్ చు జూలో సోమవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. తమ కళ్లముందే జరిగిన దారుణాన్ని చూసిన సందర్శకులు షాకయ్యారు. జూలో ఉన్న పులులకు బతికున్న గాడిదను ఆహరంగా వేయడం సోషల్ మీడియాలో వైరల్ గా
జూలో పులులకు ఆహారం వేసేందుకు సిబ్బంది ఓ వాహనంలో గాడిదను తీసుకొచ్చారు. దీనిని పులు ఉండే ప్రదేశంలోని కంచెవద్దకు తీసుకెళ్ళారు. వాహనంలో నుండి నేరుగా పులులు ఉండే ప్రాంతంలోకి బలవంతంగా తోసేశారు.
గాడిద సరాసరి నీటిలో పడిపోయింది. గాడిదను గుర్తించిన పులులు దాన్ని పట్టుకొన్ని పీక్కుతిన్నాయి. ప్రాణాలు రక్షించుకొనేందుకు గాడిద చేసిన ప్రయత్నం సందర్శకులతో కన్నీళ్ళు పెట్టించింది.
మూడుపులులు వచ్చి గాడిదను బతికి ఉండగాలనే చంపి తినేశాయి. జూ సిబ్బంది దారుణాన్ని కొందరు వీడియో తీసి నెట్ లో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పులికి ఆహరంగా బతికి ఉన్న జంతువును వేసి క్రూరంగా ప్రవర్తించారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సిబ్బందికి జాలి, దయ లేకపోవడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రకమైన దారుణాలకు జూ సిబ్బంది మానివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.