Romance:రాత్రివేళ ఊగుతున్న కారు.. రోడ్డుపైనే రతి క్రీడ..నివ్వెరపోయిన పోలీసులు..!
డెర్బీ: కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో పలు దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధించారు. కేసులు ఎక్కువగా పెరుగుతుండటం, కొత్త స్ట్రెయిన్ వేరియంట్ పంజా విసురుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయా ప్రభుత్వాలు వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే యూకేలో లాక్డౌన్ విధించగా... మరికొన్ని దేశాలు లాక్డౌన్ విధించాలన్న ఆలోచన చేస్తున్నాయి. ఇక లాక్డౌన్తో ప్రజలకు మళ్లీ కష్టకాలం ప్రారంభమైంది.అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు.
ఇక ప్రేమజంటలైతే తమ ప్రియుడిని/ప్రియురాలిని కలుసుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పుడు మన కథలో కూడా అలాంటి ఓ ప్రేమజంట ఒకటి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత కలుసుకున్న వీరు పోలీసుల కంట పడ్డారు.. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది.
కారులోనే కామకేళి
కరోనావైరస్తో యూకేలో లాక్డౌన్ విధించారు. ఇది లవర్స్కు మాత్రం ఒక శాపంలా మారింది. లాక్డౌన్తో జంటలు కలవలేకపోతున్నాయి. ఇంటికే పరిమితం అవుతున్న వారి విరహవేదన వర్ణనాతీతం. ప్రియుడితో కలవాలని ప్రియురాలు, ప్రియురాలిని కలిసి ప్రేమ ముచ్చట్లు చెప్పాలని ప్రియుడు, ఇలా ఇద్దరూ అనుకుంటున్నప్పటికీ లాక్డౌన్ అమలులో ఉండటంతో ఫోన్లకే పరిమితమయ్యారు.
కానీ మన కథలో లవర్స్ మాత్రం ఇక లాక్డౌన్తో లాభం లేదని భావించి నిబంధనలు ఉల్లంఘించారు. డెర్బీ నగరంకు చెందిన ఓ జంట చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో వారి ఆకలికి హద్దు లేకుండా పోయింది. ఇదంతా కాదని ఏకంగా కారులోనే కామకేళి ప్రారంభించారు.
కారు ఊగుతుండటంతో...
ఇక వీరి రొమాన్స్ పీక్ స్టేజెస్లో ఉంది. ఎంతలా అంటే ఏకంగా తమ కామకేళికి వేదికగా నిలిచిన కారు విపరీతంగా ఊగసాగింది.ఇంతలోనే అటుగా వెళుతున్న పోలీసుల కంట ఊగుతున్న కారు కనిపించింది. ఇదేంటి కారు ఇంతలా ఊగుతోందని పోలీసులు నెమ్మదిగా దగ్గరకు వెళ్లి చూశారు. ఇంకేముంది కారులోపల ఉన్న జంట కసిమీద దుమ్ములేపుతున్నట్లు పోలీసులు గమనించారు.
చాలా కాలం తర్వాత ఈ కపుల్ కలవడంతో ఇద్దరూ ఎంతో కాలంగా అదిమి పట్టుకున్న వారి ఫీలింగ్స్ను ఒక్కసారిగా రిలీజ్ చేశారు. ఇక శృంగారంలో మునిగి తేలుతున్న వీరికి ఒక్కసారిగా ఎవరో కారు కిటికీని కొడుతున్నట్లు వినిపించింది. దీంతో వారి రొమాన్స్కు బ్రేక్ పడింది.
రూ.40వేలు జరిమానా విధించిన పోలీసులు
కారు తలుపు కొట్టింది ఎవరా అని చూసిన ఈ జంట షాకయ్యారు. కారు కిటికీని కిందకు తీయగా ఎదురుగా పోలీసులు ఉన్నారు. ఏం చేస్తున్నారో పోలీసులు కారు కిటికీ నుంచి తొంగి చూడగా యువతీ యువకుడు నగ్నంగా కనిపించారు. వారి శరీరంపై కనీసం నూలుపోగు కూడా లేదు. పోలీసులను చూసి ఈ కపుల్ షాక్ అవ్వగా... నగ్నంగా ఉన్న వీరిద్దరినీ చూసి పోలీసులు షాక్ అయ్యారు.
ఇక పోలీసులు రంగంలోకి దిగారు. వీరికి జరిమానా విధించారు. ఒక్కొక్కరికీ 200 పౌండ్లు ఫైన్ విధించారు పోలీసులు. అంటే మన భారత కరెన్సీలో ఒక్కొక్కరూ రూ.40వేలు కట్టాల్సి ఉంటుంది. అయితే కారులో శృంగారం చేస్తున్నందుకు పోలీసులు ఈ జరిమానా విధించలేదు.. మరెందుకు అనుకుంటున్నారా..?
జరిమానా ఎందుకు విధించారంటే...
కారు ఊగేంతగా కామక్రీడలో ఉన్న వీరికి పోలీసులు భారీ జరిమానా విధించారు. అయితే రొమాన్స్ చేస్తున్నందుకు ఆ జరిమానా విధించలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మాత్రమే వారికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. యూకేలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
సందు దొరికితే ఒళ్లు సల్లబెడుదామనుకుంటున్నవారే ఎక్కువగా జరిమానాకు గురయ్యారు. కోవిడ్తో లాక్డౌన్ విధించడంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రేమపక్షులు మాత్రం అప్పుడప్పుడు ఇళ్లను వీడి రహస్యంగా కలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇలా పోలీసులకు చిక్కి భారీ జరిమానా కడుతున్నారు.