వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లండన్ ట్యూబ్ ట్రైన్లో పేలుళ్లు: పలువురికి గాయాలు
లండన్ : పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం పేలుళ్ళు సంభవించాయి. ట్యూబ్ ట్రైన్లో జరిగిన ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రైలు వెనుక భాగంలో ఓ బకెట్ నుంచి పేలుళ్ళు వినిపించాయని అంటున్నారు. సంఘటనా స్థలానికి భద్రతాధికారులు హుటాహుటిన తరలి వెళ్ళారు. తనిఖీలు నిర్వహించేందుకు రైల్వే స్టేషన్ను మూసివేశారు. చాలా మంది ప్రయాణికులు కాలిన గాయాలతో పరుగులు తీస్తున్నట్లు సమాచారం.
అత్యవసర సహాయక దళాలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ లండన్లో ఉంది. ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారని పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.
Comments
English summary
Police and ambulance services said they were responding to an "incident" at an Underground station in west London on Friday, following media reports of an explosion.
Story first published: Friday, September 15, 2017, 14:06 [IST]