ప్రధాని మోడీకి అరుదైన కానుకలిచ్చిన పుతిన్
మాస్కో: ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అరుదైన కానుక అందజేశారు. రష్యా పర్యటనలో ఉన్న మోడీ గురువారం పుతిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసిన డైరిలోని ఒక పేజీని గాంధీ చిత్రపటంతోపాటు మోడీకి కానుకగా అందజేశారు.
అంతేగాక, 18వ శతాబ్దం కాలం నాటి బెంగాల్కు చెందిన ఒక కత్తిని కూడా పుతిన్ మోడీకి అందజేశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అరుదైన కానుకలు అందజేసినందుకు మోడీ ట్విట్టర్ ద్వారా పుతిన్కి ధన్యవాదాలు తెలిపారు.
The
18th
century
sword
from
Bengal
that
belonged
to
the
Najafi
Dynasty,
gifted
to
me
by
President
Putin.
pic.twitter.com/LfP5szD503
—
Narendra
Modi
(@narendramodi)
December
24,
2015
President
Putin
gifted
me
a
page
from
Gandhi
ji's
diary
containing
Bapu's
handwritten
notes.
pic.twitter.com/L6xs9KdRq4
—
Narendra
Modi
(@narendramodi)
December
24,
2015
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో శిఖరాగ్ర చర్చలు జరపడం కోసం మోడీ బుధవారం నుంచి రెండు రోజులు అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాలు అణు విద్యుత్, రక్షణ రంగాలు సహా వివిధ రంగాల్లో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.