షాక్: వ్యక్తి శవం ముందు అర్ధనగ్న యువతుల నృత్యాలు(వీడియో)
బీజింగ్: ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఆవేదన భరితంగా మారిపోతుంది. కానీ, చైనాలో మాత్రం కొందరు మరణిస్తే అలా జరగడం లేదు.
వ్యక్తి మృతి చెందితే ఓ శుభ కార్యంలా, వేడుకలా జరుపుతున్నారు కొందరు. తాజాగా, ఓ వ్యక్తి చనిపోతే.. అతని మృతదేహం వద్ద అర్ధనగ్న నృత్యాలు చేస్తూ పలువురు యువతులు కనిపించారు. అంతేగాక, ఆ శవంపై పడుతూ లేస్తూ చిందులేశారు.
అయితే, ఆ చనిపోయిన వ్యక్తి తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఇలాగే జరగాలని కోరుకున్నాడట. అందుకోసమే అతని కుటుంబసభ్యులు ఈ ఏర్పాటు చేయడం గమనార్హం.
కాగా, చైనా, తైవాన్ దేశాలలో కొందరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే తమ అంత్యక్రియలకు ఎక్కువ మంది జనం వస్తారనేది చనిపోయిన వారి ప్రధానోద్దేశమట. కొంత విడ్డూరమనిపించినా ఇప్పుడు అక్కడ ఇదే ట్రెండ్గా మారిపోతోందట. అధికారులు మాత్రం ఇలాంటి చర్యలను ఉపేంక్షిమని చెబుతున్నారు.