నేపాల్లో సహాయక చర్యల్లో: దటీజ్ మనీషా కోయిరాలా
ఖాట్మాండు: బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ప్రస్తుతం తన దేశమైన నేపాల్లో సహాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నేపాల్ రాజధాని ఖాట్మాండుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
తన దేశంలో వచ్చి భూకంపంపై ఆమె అప్పుడే కదలిపోయారు. తన దేశానికి వెంటనే సహకరించిన ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఆమె తన దేశంలో భూకంప సహాయక పనుల్లో నిమగ్నమయ్యారు.
కాగా, మనీషా కొయిరాల ఫేస్బుక్ హ్యాకింగ్కి గురయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె గురువారం వెల్లడించారు. తన ఫేస్బుక్ ఖాతా నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే వాటిని చూడొద్దని, అవి తాను పంపడం లేదని, నా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఆమె పేర్కొన్నారు.
సామాజిక అనుసంధాన వేదికల్లో ఆమె చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన అభిమానులకు చేరవేస్తుంటారు. ఆమె చివరిగా రామ్ గోపాల్ వర్మ సినిమా భూత్ రిటర్న్స్లో నటించారు.