ఆఫ్గనిస్తాన్లో తొక్కిసలాట 11 మంది మహిళల మృతి.. పలువురికి గాయాలు...
ఆఫ్గనిస్తాన్లో తొక్కిసలాట జరిగింది. సంగర్ హార్ ప్రావిన్స్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ కాన్సులేట్ వద్ద వీసా దరఖాస్తు కోసం స్టేడియం వద్ద జనం గుమిగూడారు. అయితే అక్కడినుంచి బయటకు వచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట జరగడంతో 11 మంది మహిళలు చనిపోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు మాత్రమే పురుషులు ఉన్నారు. తొక్కిసలాట జరిగే సమయంలో బలహీనంగా మహిళలు.. పట్టులేక పడిపోయి ఉంటారు. వారి పై నుంచి జనం పోవడంతో ఊపిరాడక చనిపోయి ఉంటారు. అదే పురుషులు అయితే బలంగా ఉండటంతో కిందపడిపోలేదు. లెక్కలను బట్టి చూస్తే ఇద్దరు మాత్రమే చనిపోవడం దీనికి అద్దం పడుతోంది.
కరోనా వైరస్ వల్ల వీసాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 7 నెలల నుంచి అక్కడే ఉండగా.. అనుమతి ఇవ్వడంతో జనం ఎగబడ్డారు. పాకిస్తాన్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకొని.. తిరిగి వచ్చే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనపై ఆప్గనిస్తాన్లో పాకిస్తాన్ రాయబరి మన్సూర్ అహ్మద్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. వీసా దరఖాస్తు మరింత మెరుగైన వసతి కల్పించాలని.. ఆప్గనిస్తాన్ ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.