మొజాంబిక్ దగ్గర్లో ఎంహెచ్ 370 విమాన శకలాలు!
వాషింగ్టన్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ వాషింగ్టన్లోని తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముజాంబిక్, మెడగాస్కర్ మధ్య లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆ ప్రాంతంలో ఎంహెచ్ 370 విమాన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా నావికులు గుర్తించినట్లుగా తెలిపింది. ఈ ప్రాంతంలో ఎంహెచ్ 370కి చెందిన పొడవైన విభాగానికి చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది.
అయితే ఈ నివేదికను రాయటర్స్ ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా.. ఆ ప్రాంతంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
కాగా, 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 225 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు.