మైఖేల్ జాక్సన్ ను చంపారు: స్నేహితుడు పెర్కిన్ సంచలనం
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తన చివరి రోజుల్లో మరణభయంతో అల్లాడిపోయాడు. తనను వారే చంపాస్తారంటూ ఆయన తన ఆప్తమిత్రుడికి లేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆయన ఓ అస్ట్రేలియన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తేల్చిచెప్
సిడ్నీ :పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తన చివరి రోజుల్లో మరణభయంతో అల్లాడిపోయాడు. తనను వారే చంపాస్తారంటూ ఆయన తన ఆప్తమిత్రుడికి లేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆయన ఓ అస్ట్రేలియన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తేల్చిచెప్పారు.
మైఖేల్ కూతురు ప్కారీస్ జాక్సన్ కూడ మొదటి నుండి ఈ మాటే చెబుతోంది. తన తండ్రి డ్రగ్స్ వల్ల మరణించలేదని , ఆయనను హత్య చేశారని ఆమె చెబుతోంది.
అయితే ఆమె మాట ఎవరూ కూడ వినలేదు. మైఖేల్ జీవన కోణంపై అస్ట్రేలియా చానల్ ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది. ఇందులో మైఖేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన మరణానికి ముందు మైఖేల్ ఏకంగా తనకు 13 ఉత్తరాలు రాశాడని చెప్పాడు. అందులో వాళ్ళే తనను చంపేస్తారంటూ విపరీతమైన భయాన్ని వ్యక్తం చేశాడని చెప్పారు.
లండన్ కు చెందిన ఓ కచేరీ సంస్థ ఏఈజీ తనను విపరీతంగా ఒత్తిడి గురిచేస్తోందని, జీవితం పట్ల తనకు భయంగా ఉందన్నారు. జాకబ్ తో మైఖేల్ చెప్పాడని ఆయన ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు.
2009 జూన్ 25న, మైఖేల్ జాక్సన్ చనిపోయాడు. అయితే అదే రోజున మైఖేల్ జాక్సన్ మరణంపై రహస్యాలను ఆ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ఈ ఇంటర్వ్యూ పెను సంచలనంగా మారనుంది.
వీరిద్దరి మద్య స్నేహం దశాబ్దం కన్నా ఎక్కువే అని ఆ చానెల్ చెబుతోంది. మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారీస్ జాక్సన్ దీనికి మద్దతిస్తూ ఏకంగా ఓ పోరాటమే ప్రారంభించనుంది.