వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైఖేల్ జాక్సన్ ను చంపారు: స్నేహితుడు పెర్కిన్ సంచలనం

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తన చివరి రోజుల్లో మరణభయంతో అల్లాడిపోయాడు. తనను వారే చంపాస్తారంటూ ఆయన తన ఆప్తమిత్రుడికి లేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆయన ఓ అస్ట్రేలియన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తేల్చిచెప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిడ్నీ :పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తన చివరి రోజుల్లో మరణభయంతో అల్లాడిపోయాడు. తనను వారే చంపాస్తారంటూ ఆయన తన ఆప్తమిత్రుడికి లేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆయన ఓ అస్ట్రేలియన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తేల్చిచెప్పారు.

మైఖేల్ కూతురు ప్కారీస్ జాక్సన్ కూడ మొదటి నుండి ఈ మాటే చెబుతోంది. తన తండ్రి డ్రగ్స్ వల్ల మరణించలేదని , ఆయనను హత్య చేశారని ఆమె చెబుతోంది.

michael jackson

అయితే ఆమె మాట ఎవరూ కూడ వినలేదు. మైఖేల్ జీవన కోణంపై అస్ట్రేలియా చానల్ ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది. ఇందులో మైఖేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన మరణానికి ముందు మైఖేల్ ఏకంగా తనకు 13 ఉత్తరాలు రాశాడని చెప్పాడు. అందులో వాళ్ళే తనను చంపేస్తారంటూ విపరీతమైన భయాన్ని వ్యక్తం చేశాడని చెప్పారు.

లండన్ కు చెందిన ఓ కచేరీ సంస్థ ఏఈజీ తనను విపరీతంగా ఒత్తిడి గురిచేస్తోందని, జీవితం పట్ల తనకు భయంగా ఉందన్నారు. జాకబ్ తో మైఖేల్ చెప్పాడని ఆయన ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు.

2009 జూన్ 25న, మైఖేల్ జాక్సన్ చనిపోయాడు. అయితే అదే రోజున మైఖేల్ జాక్సన్ మరణంపై రహస్యాలను ఆ ఛానల్ ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ఈ ఇంటర్వ్యూ పెను సంచలనంగా మారనుంది.

వీరిద్దరి మద్య స్నేహం దశాబ్దం కన్నా ఎక్కువే అని ఆ చానెల్ చెబుతోంది. మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారీస్ జాక్సన్ దీనికి మద్దతిస్తూ ఏకంగా ఓ పోరాటమే ప్రారంభించనుంది.

English summary
The letters, which have only just been released by German businessman Michael Jacobshagen who was close friends with the megastar for over 20 years, show his emotional turmoil in the weeks up to his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X