నిద్రలో నడుస్తూ.....11 అంతస్థుల నుండి కిందపడినా... మ్యత్యుంజయురాలు.. !
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదకొండు అంతస్థుల బిల్డింగ్ నుండి కిందపడిపోయినా....ఓ 5 సంవత్సరాల చిన్నారీ చావును జయించి మృత్యుంజయురాలు అయింది. సంఘటన హోటల్ జరగడంతో రికార్డ్ అయిన ప్రమాదవీడియో సోషల్ మీడియా సంచలనం రేపుతోంది.
థాయ్లాండ్కు చెందిన దీచా సూకల్పం అనే ఓ పోలీస్ అధికారి తన చిన్నారీ కూతురుతో కలిసి థాయ్లాండ్లోని పట్టాయా నగరానికి వ్యక్తిగత పనిమీద వెళ్లారు. ఇద్దరు కలిసి ఓ హోటల్లో బస చేశారు. విషయమేటింటే సూకల్పం కూతురికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ అలవాటుతోనే రాత్రి సమయంలో నిద్రించిన తర్వాత నడుచుకుంటూ తన రూం నుండి నడుచుకుంటూ బయటికి వచ్చింది..
అలా నడుచుకుంటూ హోటల్ బాల్కనిలోకి వెళ్లింది. నేరుగా బాల్కానీలో ఉన్న సైడ్వాల్స్ ఎక్కింది. అకస్మత్తుగా మత్తునుండి కున్న పాప సైడ్వాల్స్ పట్టుకుని కొద్దిసేపు ఏడుస్తూ వేలాడింది. అయినా రాత్రీపూట కావడంతో ఎవ్వరికి వినకపడకపోవడం వల్ల తర్వాత నేరుగా నేలమీద పడింది.
పదకొండు అంతస్థుల నుండి కిందపడిన దీచా ఏడూస్తూనే కిందపడిపోయిన దీచా అనంతరం స్పృహ తప్పింది. వెంటనే దీచాను ను చూసిన హోటల్ సిబ్బంది హుటహుటిన ఆసుపత్రికి తరలించారు..చిన్నారీ పరీశీలించిన డాక్టర్లు మాత్రం ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే ఆమే షాక్ గురికావడంతో కొలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది..అయితే చిన్నారీ పడిపోతున్నప్పుడు హోటల్ ఉన్నసీసీ కేమేరాల్లో రికార్డ్ అయిన వీడియో మాత్రం హల్చల్ చేస్తోంది.