‘కూతురుపై వివక్ష తట్టుకోలేక ముగ్గురు కొడుకుల హత్య’
ఓహియో: కన్న కూతురిపై తండ్రి వివక్షను తట్టుకోలేకపోయిన ఓ తల్లి విచక్షణ కోల్పోయి తన ముగ్గురు కొడుకులను చంపేసింది. కొడుకులపై విపరీతమైన ప్రేమను పెంచుకున్న తండ్రి, కూతురిని నిర్లక్ష్యం చేస్తుండటంతో ఆ తల్లి ఏమి చేయాలో తెలియక ఈ ఘాతుకానకి పాల్పడింది.
అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. అయితే ఈ హత్యలను ఆమె చేసినట్లుగా మొదట అంగీకరించలేదు. ఎలాంటి అనుమానమూ రాకుండా ఆమె ఈ హత్యలను చేసింది. అయితే చివరకు కోర్టులో నేరాన్ని అంగీకరించింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికలోని ఓహియో నగరానికి చెందిన జోసెఫ్, బ్రిట్నీ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అయితే కొడుకులపైనే ప్రేమను పెంచుకున్న జోసెఫ్ కూతురిని పట్టించుకోవడం మానేశాడు.
దీంతో కసి పెంచుకున్న బ్రిట్నీ కడుపు తీపిని కూడా మరిచి వారి ముఖాలపై దుప్పటి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 13 నెలల వ్యవధిలో ఒక్కొక్కరిగా ముగ్గురు కొడుకులను హతమార్చిన ఆ తల్లి.. ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
తొలుత పెద్ద కుమారుడు చనిపోయినపుడు జోసెఫ్తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు కొలిక్కి రాక ముందే మరో ఇద్దరిని కూడా చంపేసింది. కాగా, ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులకు బ్రిట్నీపైనే అనుమానమొచ్చింది. ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో చివరకు నేరం ఒప్పుకుంది. కాగా, మృతులంతా పదేళ్లలోపు బాలురే.